టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మాజీమంత్రి కొండా సురేఖ ఫైర్ అయ్యారు. ఇరకాటంలో పెట్టారు. ప్రజలకు ఇచ్చిన మాట తప్పిన కేసీఆర్ ముక్కు నేలకు రాయాలంటోంది.
తెలంగాణలోని పరకాలలో జరిగిన ఉప ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఇక్కడ వైఎస్ఆర్-టీఆర్ఎస్ పార్టీల మధ్యన గట్టి పోటీ జరిగింది. అయితే, మొదటి రౌండ్ లెక్కించే వరకు టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి పన్నెండు వందల పై చిలుకు ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నాడు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/335/
పరకాల పట్టణమంతా గులాబీమయంగా మారింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం రాత్రి పరకాలలో టీఆర్ఎస్ బహిరంగ సభను నిర్వహించింది. శుక్రవారం నాడు ఇక్కడే వైఎస్సాఆర్ పార్టీ నిర్వహించిన సభకు అనూహ్యమైన ప్రజా స్పందన లభించింది. దీనితో శనివారం టీఆర్ఎస్ తలపెట్టిన కేసీఆర్ బహిరంగ సభను ఆ పార్టీ నాయకులు ఎంతో ప్రతిష్టగా తీసుకుని జనాలను తరలింపచేశారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/228/
వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాకతో పరకాల ఉప ఎన్నికల చిత్రం పూర్తిగా మారిపోయింది. మొన్నటి వరకు ఇక్కడ తెరాస-బీజేపీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని అందరూ భావించారు. అయితే, శుక్రవారం నాడు పరకాల నియోజక వర్గంలో విజయమ్మ, షర్మిల పర్యటన అనంతరం అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా విజయమ్మ, షర్మిలలకు పరకాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వారు పర్యటించిన అన్ని ప్రాంతాలలో ప్రజలు తమ ఆప్యాయతను పంచారు. అక్కున చేర్చుకున్నారు. వేలాదిగా ప్రజలు తరలి రావడంతో పరకాలలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ఇతర పార్టీలకు ఏమీ తీసిపోని విధంగా ఉందనేది తేలిపోయింది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/205/
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలంగాణలోని పరకాలకు వచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకురాళ్లు విజయమ్మ,షర్మిలలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. విజయమ్మ, షర్మిల సభలకు పరకాలలో ప్రజలు పొటెత్తారు. విజయమ్మ, షర్మిలలను తెలంగాణ ప్రజలూ అక్కున చేర్చుకున్నారు. ఆప్యాయతను పంచారు. ఊహించిన దానికంటే ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజలు భారీ సంఖ్యలో హాజరు కావడం, ఎలాంటి సంఘటనలు జరగకపోవడంతో ఆ పార్టీ నాయకుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. జనం తరలి వచ్చిన తీరును బట్టి పరకాలలో తమదే విజయమని వైఎస్ఆర్ పార్టీ అంటోంది.
Read complete article here @ http://www.apherald.com/Politics/ViewArticle/203/
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు పరకాలలో తెరాస బహిరంగ సభను నిర్వహించనున్నది. తెరాస చీఫ్ కేసీఆర్ హాజరు కానున్న ఈ సభను ఆ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. శుక్రవారం నాడు పరకాలలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ తరుపున ఆ పార్టీ నాయకురాళ్లు విజయమ్మ,
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/202/
ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కూతురు షర్మిల శుక్రవారం నాడు తెలంగాణలోని వరంగల్ జిల్లా పరకాల నియోజక వర్గంలో పర్యటించనున్నారు. వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖకు మద్దతుగా తల్లీకూతుర్లు ఇద్దరూ పరకాల నియోజక వర్గంలోని గీసుకొండ, పరకాలలో జరిగే ప్రచార కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/198/
పరకాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైకాపా పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ, ఆమె కూతురు షర్మిల పర్యటన ఖరారైంది. ఈ నెల 8,9తేదీలలో వాళ్లిద్దరూ పరకాలలో పర్యటించనున్నారు. వారి పర్యటనకు పార్టీ శ్రేణులు సర్వం సిద్ధం చేశాయి. అయితే, ఈ పర్యటనపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో అడుగుపెట్టే ముందు వైకాపా పార్టీ నేతలు తెలంగాణపై స్పష్టమైన వైఖరి చెప్పి రావల్సిందిగా తెలంగాణ జేఏసీ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు హెచ్చరిస్తున్నారు. అటు రాజకీయ జేఏసీ, ఇటు టీఆర్ఎస్ ఇరువురు వైకాపాకు వార్నింగ్ ఇవ్వడంతో పరకాలలో వైకాపా పార్టీ నేతల ప్రచారం ఎలా సాగుతుందనే దానిపై అందరిలోనూ టెన్షన్ మొదలైంది.
http://www.apherald.com/Politics/ViewArticle/131/వ