ముందుగా చెప్పినట్లుగానే జనం జగన్ వైపే మొగ్గు చూపారు. టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎన్ని విధాలుగా జగన్ గురించి చెప్పినా ప్రజలు నమ్మలేదు. అవినీతిని ప్రధాన
ఓట్ల లెక్కింపు ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు తమ ఆధిక్యతను చాటుకుంటున్నారు. తొలుత తిరుపతిలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డితో ప్రారంభమైన ఈ ఆధిక్యత మిగతా అన్ని స్థానాలలో కనబర్చింది. తొలుత వందల్లో ఆధిక్యతలో ఉన్న వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు రెండో రౌండ్, మూడో రౌండ్ కు వచ్చే సరికి వారి ఆధిక్యత వేలలోకి వెళ్లింది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/336/
తెలంగాణలోని పరకాలలో జరిగిన ఉప ఎన్నికల్లో కారు జోరు కొనసాగుతోంది. ఇక్కడ వైఎస్ఆర్-టీఆర్ఎస్ పార్టీల మధ్యన గట్టి పోటీ జరిగింది. అయితే, మొదటి రౌండ్ లెక్కించే వరకు టీఆర్ఎస్ అభ్యర్థి భిక్షపతి పన్నెండు వందల పై చిలుకు ఓట్ల ఆధిక్యతతో కొనసాగుతున్నాడు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/335/
ఊహించిన విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతతోనే కొనసాగుతోంది. అంతటా ఫ్యాన్ గాలి వీచే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి రౌండ్ లోనే తిరుపతి, ఆళ్లగడ్డ, రాయచోటి, రాజంపేట, నర్సన్నపేట, పోలవరం, ఎమ్మిగనూరు తదితర అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతను కొనసాగిస్తున్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/334/
అందరూ ఎంతో ఆత్రుతతో ఎదురు చూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. నరాలు తెగే ఉత్కంఠతో ఎదురు చూస్తున్న ఓట్ల లెక్కింపు మరి కొన్ని నిమిషాల్లో ప్రారంభం కాబోతోంది. గంటల్లోనే ఫలితాలు తెలుస్తాయి. అభ్యర్థుల జాతకం తేలిపోనున్నది. శుక్రవారం ఉదయం 8గంటల నుంచి లెక్కింపు ప్రారంభమవుతోంది. దీని కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. కౌంటింగ్ కు కౌంట్ డౌన్ ప్రారంభం కాబోతుండటంతో అన్ని పార్టీలలో భయం పుంజుకుంది. గెలుపుపై ఎవరికి వారు ధీమాగా ఉన్న మరి కొంత సేపట్లో తమ భవిష్యత్ తేలిపోతుండటంతో అందరిలో ఏదో తెలియని టెన్షన్.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/333/
మరికొన్ని గంటల్లో ఉప ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. రాష్ర్టంలోని పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు పార్లమెంటు కు ఈ నెల12న పోలింగ్ జరిగిన విషయం విధితమే. ఓట్ల లెఖ్కింపుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లను చేసింది. ఉదయం 8గంటలకు ఓట్ల లెఖ్కింపు ప్రారంభమవుతోంది. ఎలక్ర్టానిక్ యంత్రాలు కావడం వల్ల మధ్యాహ్నంకల్లా ఫలితాలు వస్తాయి. ఇదిలా ఉంటే, ఎవరి భవిష్యత్ ఎలా ఉండబోతోందో కొన్ని గంటల్లలో తేలిపోనున్నది. ఓట్ల లెఖ్కింపుకు టైం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులలో ఒకటే టెన్షన్. గెలుపుపై పైకి మేకబోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూనే లోలోపల మాత్రం ఏదో తెలియని భయం.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/330/
ఇప్పుడు అందరి నోట జూన్ 15 మాటే. నలుగురు గుమి గూడితే చాలు జూన్ 15 గురించి మాట్లాడుకుంటున్నారు. యావత్ ప్రజానీకం జూన్ 15 కోసం ఎంతో ఉత్కంఠగా ఎదురుస్తోంది. జూన్ 15 రావడానికి కేవలం కొన్ని గంటలు మాత్రమే మిగిలింది. అందరూ 15గురించి ఎదురు చూడటానికి కారణం లేకపోలేదు. రాష్ర్ట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా నెల్లూరు పార్లమెంటు స్థానంతో పాటు తెలంగాణలోని పరకాల, సీమాంధ్రలోని 17 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 12న ఉప ఎన్నికలు జరిగాయి. వాటి ఫలితాలు జూన్ 15న వెలువడున్నాయి. అత్యంత ఖరీదైన ఎన్నికలే కాకుండా, రాష్ర్టంలోని పలు ప్రధాన పార్టీల నాయకుల భవిష్యత్ ఈ ఉప ఎన్నికల ఫలితాలపై ఆధారపడి ఉండటమే జూన్ 15కు ఉన్న ప్రాధాన్యత.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/323/
రాష్ర్ట చరిత్రలోనే ప్రప్రథమంగా జరిగిన ఖరీదైన ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఫ్యాన్ గాలి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యాన్ గాలికి ప్రత్యర్ధుల అడ్రస్లు గల్లంతు కావడం ఖాయమని మంగళవారం జరిగిన పోలింగ్ సరళి, సర్వేలను బట్టి తెలుస్తోంది. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ మనుగడకు, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పరువు, ప్రతిష్టతలకు ఈ ఎన్నికలు పెను సవాల్గా, అగ్ని పరీక్షగా జరిగాయి. ఒక మాటలో చెప్పాలంటే రాష్ర్టంలోని అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యతో కూడుకున్నవే. రాష్ర్టంలో మునుపెన్నడూ లేని విధంగా జరిగిన ఈ ఉప ఎన్నికలు రావడానికి రైతు సమస్యలపై అసెంబ్లీలో టీడీపీ పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా జగన్ వర్గానికి చెందిన 17మంది శాసనసభ్యులు ఓటేసీ అనర్హతకు గురయ్యారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/296/
విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఎప్పటిలాగే తన ఎగ్జిట్ పోల్ ఫలితాలను వెల్లడించారు. ఆయన అంచనా ప్రకారం మెజార్టీ స్థానాలను జగన్ వర్గం అభ్యర్థులు కైవసం చేసుకుంటారన్నారు. పద్దెనిమిది అసెంబ్లీ స్థానాలలో వైఎస్ఆర్ పార్టీ 12నుంచి 16 స్థానాల వరకు గెలువ వచ్చన్నారు. నెల్లూరు పార్లమెంటు సీటు విషయం మాత్రం చెప్పలేకపోయారు. కాంగ్రెస్ పార్టీ ఒకటి నుంచి 3, టీడీపీ జీరో నుంచి 2 వరకు, టీఆర్ఎస్ ఒక స్థానంలో గెలిచే అవకాశాలున్నాయన్నారు. టీడీపీకి ఒక సీటు కూడా రాకపోయినా ఆశ్చర్యం ఏమీ లేదన్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/292/
మంగళవారం నాడు జరిగిన పోలింగ్ సందర్భంగా పలు చోట్ల కొంత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. సాయంత్రం 5గంటలకు ముగిసింది. పోలింగ్ జరిగిన అన్ని చోట్ల 70శాతం కు పైగాన పోలింగ్ జరిగింది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఎంతో ఉత్సాహాన్ని చూపించారు. మధ్యాహ్నం వరకు పోలింగ్ ప్రశాంతంగానే జరిగినా తరువాత కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/289/
చిన్న చిన్న సమస్యలు మినహాయించి పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ ప్రారంభం కావడంతోనే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి కేంద్రాల వద్దకు బారులు తీరారు. ఓటును వేసేందుకు ఉత్సాహాన్ని చూపెడుతున్నారు. రాష్ర్టంలోని 18 అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు పార్లమెంటు స్థానానికి ఈ రోజు ఉదయం 8గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. అక్కడక్కడ ఈవీఎంలు మొదట్లో కొంత మొరాయించడం వంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/276/
నేటి ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు ఉప ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనున్నది. ఈ పోలింగ్ ప్రశాంతంగా జరగడానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ అన్ని ఏర్పాట్లను చేసింది. రాష్ర్టంలోని 12 జిల్లాలోని 18అసెంబ్లీ స్థానాలకు, నెల్లూరు పార్లమెంటు స్థానానికి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో 46లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/272/
ఆదివారం సాయంత్రం 5గంటలతో ఉప ఎన్నికల ప్రచారానికి తెరపడ్డది. మైకులు మూలనపడ్డాయి. ప్రచారం సమాప్తమైనప్పటికీ అసలు ఆట ఇప్పుడే మొదలైంది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే అసలు సిసలైన కార్యక్రమానికి ఇప్పుడే తెర లేచింది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ఆయా పార్టీలు సర్వం సిద్ధచేసుకున్నట్లు తెలుస్తోంది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/241/