Monday, July 9, 2012

విజయమ్మ రాకతో మారిన పరకాల సీన్

వైఎస్ఆర్ పార్టీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాకతో పరకాల ఉప ఎన్నికల చిత్రం పూర్తిగా మారిపోయింది. మొన్నటి వరకు ఇక్కడ తెరాస-బీజేపీల మధ్యనే ప్రధానంగా పోటీ ఉంటుందని అందరూ భావించారు. అయితే, శుక్రవారం నాడు పరకాల నియోజక వర్గంలో విజయమ్మ, షర్మిల పర్యటన అనంతరం అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. ఎవరూ ఊహించని విధంగా విజయమ్మ, షర్మిలలకు పరకాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వారు పర్యటించిన అన్ని ప్రాంతాలలో ప్రజలు తమ ఆప్యాయతను పంచారు. అక్కున చేర్చుకున్నారు. వేలాదిగా ప్రజలు తరలి రావడంతో పరకాలలో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి కొండా సురేఖ ఇతర పార్టీలకు ఏమీ తీసిపోని విధంగా ఉందనేది తేలిపోయింది.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/205/

No comments:

Post a Comment