ఊహించిన విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతతోనే కొనసాగుతోంది. అంతటా ఫ్యాన్ గాలి వీచే సూచనలు కనిపిస్తున్నాయి. మొదటి రౌండ్ లోనే తిరుపతి, ఆళ్లగడ్డ, రాయచోటి, రాజంపేట, నర్సన్నపేట, పోలవరం, ఎమ్మిగనూరు తదితర అసెంబ్లీ నియోజక వర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యతను కొనసాగిస్తున్నారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/334/
రాష్ర్ట చరిత్రలోనే ప్రప్రథమంగా జరిగిన ఖరీదైన ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీకి చెందిన ఫ్యాన్ గాలి వీచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫ్యాన్ గాలికి ప్రత్యర్ధుల అడ్రస్లు గల్లంతు కావడం ఖాయమని మంగళవారం జరిగిన పోలింగ్ సరళి, సర్వేలను బట్టి తెలుస్తోంది. వైఎస్ఆర్ పార్టీ అధినేత జగన్ మనుగడకు, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల పరువు, ప్రతిష్టతలకు ఈ ఎన్నికలు పెను సవాల్గా, అగ్ని పరీక్షగా జరిగాయి. ఒక మాటలో చెప్పాలంటే రాష్ర్టంలోని అన్ని పార్టీలకు జీవన్మరణ సమస్యతో కూడుకున్నవే. రాష్ర్టంలో మునుపెన్నడూ లేని విధంగా జరిగిన ఈ ఉప ఎన్నికలు రావడానికి రైతు సమస్యలపై అసెంబ్లీలో టీడీపీ పెట్టిన అవిశ్వాసానికి అనుకూలంగా జగన్ వర్గానికి చెందిన 17మంది శాసనసభ్యులు ఓటేసీ అనర్హతకు గురయ్యారు.
Read complete article @ http://www.apherald.com/Politics/ViewArticle/296/